టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

తెలుగు దేశం పార్టీలో కీలక మార్పులు చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఎల్ .రమణను కొనసాగించారు. అంతేగాకుండా 27 మందితో జనరల్ కమిటీ, 25  మంది సభ్యులతో పొలిట్ బ్యూర్ ,31 మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించారు. నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండనున్నారు. ఇక టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, చిలువేరు కాశీనాథ్, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.

రాజీవ్ గాంధీ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ

అలాంటి రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలి

జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్