‘ఓ క్రైమ్ జరిగినప్పుడు క్లూస్ టీం చేసే పనే అధికంగా ఉంటుంది. వారు సేకరించేవే కోర్టులో సాక్ష్యాలుగా నిలబడతాయి. అలాంటి క్లూస్ టీమ్ గురించి అందరికీ తెలియజేయాలని ‘అథర్వ’ చిత్రం తెరకెక్కించాను’ అన్నాడు దర్శకుడు మహేష్ రెడ్డి. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా లీడ్ రోల్స్లో అతను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ను కూడా ఇందులో చూపించాం. కార్తీక్ రాజు క్లూస్ టీమ్లో పనిచేస్తుంటాడు. సెకండ్ హాఫ్లో ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది.
క్లైమాక్స్ను ఎవ్వరూ ఊహించలేరు. ఆ సీన్లకు ప్రేక్షుడికి ఫుల్ హై వస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియెన్స్ ఇచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.