- పది పోట్లు పొడవడంతో దవాఖానలో చేరిన బాధితుడు
- చికిత్స పొందుతూ మృతి
- జగద్గిరిగుట్ట బస్టాప్లో సాయంత్రం ఘటన
జీడిమెట్ల, వెలుగు : ఇద్దరు రౌడీషీటర్ల మధ్య పాతకక్షలు కత్తిపోట్లకు దారి తీసింది. అది కూడా అందరూ చూస్తుండగా ఒకరు పట్టుకుంటే..మరొకరు కత్తితో ఆరేడు సార్లు పొడిచాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట బస్టాప్లో సాయంత్రం వేళ వందలాది మంది చూస్తుండగా జరిగింది. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్కు చెందిన బాలాషౌరెడ్డి(25), రంగారెడ్డినగర్కి చెందిన రోషన్సింగ్(23) రౌడీషీటర్లు. బుధవారం సాయంత్రం 4.20 గంటలకు రౌడీషీటర్ రోషన్సింగ్ జగద్గిరిగుట్ట బస్టాప్ వద్ద ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. అదే టైంలో అక్కడికి మరో రౌడీషీటర్ బాలషౌరెడ్డి, అతడి ఫ్రెండ్ఆదిల్వచ్చారు.
ఇద్దరూ కలిసి ఏదో విషయంలో రోషన్సింగ్తో గొడవకు దిగారు. ఈ క్రమంలో బాలషౌరెడ్డి మరో మిత్రుడు మహ్మద్అక్కడికి వచ్చాడు. దీంతో బాలషౌరెడ్డి, ఆదిల్, మహ్మద్...రోషన్సింగ్మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో బాలషౌరెడ్డి తన వద్ద ఉన్న కత్తి బయటకు తీశాడు. మహ్మద్...రోషన్సింగ్ను పట్టుకోగా బాలషౌరెడ్డి కత్తితో అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా కత్తితో పొడవడం మొదలుపెట్టాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు అరుపులు, కేకలు పెట్టుకుంటూ పరుగులు తీశారు.
సుమారు పది వరకు కత్తి పోట్లు పొడవగా రోషన్సింగ్రక్తమోడుతూ అక్కడే పడిపోయాడు. తర్వాత బాలషౌరెడ్డి, ఆదిల్, మహ్మద్ బైక్పై పారిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రోషన్సింగ్ను స్థానికంగా ఉన్న దవాఖానకు, అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. పాతకక్షలే హత్యాయత్నానికి కారణంగా భావిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ప్రకటించారు.
