
గండిపేట,వెలుగు: అత్తాపూర్ డివిజన్ లక్ష్మీనగర్ జీహెచ్ఎంసీ పార్కులో సోమవారం స్థానిక యోగా సెంటర్ ఆధ్వర్యంలో ‘లాఫింగ్ డే’ నిర్వహించారు. యోగా అభ్యాసకులు, వాకర్లు పాల్గొని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు. డాక్టర్లు కాళీ వరప్రసాద్, సీతారామ్మాట్లాడుతూ నవ్వు మానసిక ధైర్యానికి.. ఆత్మవిశ్వాసానికి సాధనం అన్నారు.
నవ్వుతో శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. యోగా గురువు బి.సుధాకర్, ప్రొఫెసర్ రాఘవరెడ్డి, తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు నేదునూరి కనకయ్య పాల్గొన్నారు.