తహసీల్దార్ విజయ రెడ్డి సజీవదహనం ఘటనలో అటెండర్ మృతి

తహసీల్దార్ విజయ రెడ్డి సజీవదహనం ఘటనలో అటెండర్ మృతి

అబ్దుల్లాపూర్ మెట్  తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో మరొకరు మృతి చెందారు. తహసీల్దార్ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య  చనిపోయాడు. 28 రోజులుగా కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య…ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందాడు. చంద్రయ్య డెడ్ బాడిని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు అధికారులు.  పోస్ట్ మార్టం తర్వాత శంషాబాద్ కు తరలించనున్నారు కుటుంబ సభ్యులు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే చంద్రయ్య చనిపోయాడని  కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనలో మొత్తం ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. తహసీల్దార్ విజయారెడ్డి, నిందితుడు సురేష్.. డ్రైవర్ గురునాథ్ తో పాటు అటెండర్ చంద్రయ్య చనిపోయాడు. మరోవైపు ఇదే ఘటనలో గాయపడిన నారాయణ అనే వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.