ఆకట్టుకున్న నవ జనార్ధన పారిజాతం.. సాయి నిఖితా కాటూరి చేసిన ఏకపాత్రాభినయం

ఆకట్టుకున్న నవ జనార్ధన పారిజాతం.. సాయి నిఖితా కాటూరి చేసిన ఏకపాత్రాభినయం

ఖైరాతాబాద్ భాస్కర ఆడిటోరియంలో ఆదివారం ‘నవ జనార్ధన పారిజాతం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నర్తనశాల తరఫున సాయి నిఖితా కాటూరి చేసిన ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పునరావిష్కరించి, లిఖితరూపం ఇచ్చిన ఈ నృత్యరూపకాన్ని ఆయన శిష్యుడు కళాకృష్ణ నృత్య దర్శకత్వం వహించారు.