హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డు పరిధిలో చందానగర్( హైదరాబాద్) , కరీంనగర్లో ఖాళీగా ఉన్న కమర్షియల్ జాగాలను వేలం వేయనుంది. చందానగర్లో మూడుచోట్ల 2,593 గజాలు, 1,809 గజాలు, 2,716 గజాల భూమికి ఈ నెల16న, కరీంనగర్లోని 4,335 గజాలు, 3,025 గజాల భూమికి ఈ నెల 17న హౌసింగ్ బోర్డు వేలం వేయనుంది.
చందానగర్ ప్లాట్లకు గజం రూ.40 వేలు, కరీంనగర్లో ప్లాట్లకు రూ.30 వేలుగా ఖరారు చేశారు. ఈ నెల 9న హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తున్నామని, ఈ నెల15వరకు వేలంలో పాల్గొనేవాళ్లు ఆన్ లైన్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని బోర్డు ఎండీ వీపీ గౌతమ్ కోరారు.
