నుమాయిష్లో స్పెషల్ అట్రాక్షన్గా ఆటమ్ బైక్స్

నుమాయిష్లో స్పెషల్ అట్రాక్షన్గా ఆటమ్ బైక్స్

ఎలక్ట్రిక్ వాహనల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. పర్యావరణహితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలను జనానికి మరింత చేరువ చేసేందుకు ఆటమ్ సంస్థ కొత్త బైక్స్ లాంఛ్ చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఆటమ్ ఈ బైక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. తక్కువ ఖర్చు మోడ్రన్ లుక్ ఉండే ఆటమ్ బైక్స్ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. న్యూ మోడ్రన్ లుక్ తో ఉన్న ఆటమ్ 1.0, ఆటమ్ వేడర్ మోడల్స్ యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. 2022లోనూ న్యూ వేరియంట్ బైక్ ఆటమ్ వేడర్ ఫస్ట్ టైమ్ నుమాయిష్ లో ప్రదర్శించారు. 

ఆటమ్ బైక్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వెళ్తుంది. స్పీడ్ 65 కి.మీ పర్ అవర్ గా ఉంది. ఎల్ ఈడీ లైట్స్, ఎల్ ఈడీ ఇండికేటర్స్, ఎల్ ఈడీ డిస్ల్పే తో అట్రాక్టివ్ లుక్ తో న్యూ మోడల్ బైక్ ను డిజైన్ చేశారు. ఇందులో 14 లీటర్ గూడ్స్ స్పేస్, 2.4కేవి లిథియ్ బ్యాటరీ ఉంటుంది. 100 శాతం బైక్ పార్ట్స్ మేడిన్ ఇండియా కావడం విశేషం. బైక్ స్పీడ్ మోడ్ 1, 2, 3  లెవెల్స్ లో 25 కి.మీ నుండి 65 స్పీడ్ వరకు రైడ్ చేయొచ్చు. ఇక ఎలక్ట్రిక్ బైక్ పొల్యూషన్ ఫ్రీ, నాయిస్ ఫ్రీ, జీరో మెయింటెనెన్స్ కావడంతో ఆటమ్ బైక్స్ మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.

నుమాయిష్ లో ఆటమ్ బైక్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఆటమ్ 1.0  మోడల్ బైక్ ధర రూ.73,000 కాగా దానిపై రూ.10వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇక ఆటమ్ వేడర్ లేటెస్ట్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్  రూ.1.45లక్షలు కాగా రూ. 30 వేల ఆపర్ ప్రైజ్ తో రూ. 1.15 వేలకు అందిస్తున్నారు. ఫిబ్రవరీ 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ లో కొనసాగనుండగా.. అప్పటి వరకు ఆఫర్స్ కంటిన్యూ చేయనున్నారు.