ఖమ్మం జిల్లాలో..సీజ్ చేసిన వాహనాలకు వేలం

ఖమ్మం జిల్లాలో..సీజ్ చేసిన వాహనాలకు వేలం

కారేపల్లి, వెలుగు : నాటు సారా, బెల్లం తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలను ఎక్సైజ్​ శాఖ అధికారులు మంగళవారం వేలం వేశారు. కారేపల్లి క్రాస్ రోడ్ లోని ఎక్సైజ్​ కార్యాలయంలో సీజ్ చేసిన తొమ్మిది  బైక్ లకు వేలం పాట నిర్వహించారు.

తొమ్మిది వెహికల్స్​ను  రూ.3.31లక్షలకు వేలం వేశారు. వేలం పాటను ఎక్సైజ్​ శాఖ అధికారులు వేణుగోపాల్, జుల్ఫికర్ అహ్మద్, వసంతలక్ష్మి నిర్వహించారు.