గోల్కొండ కోటలో ఆగస్టు 15 వేడుకలు : సీఎస్​శాంతి కుమారి

గోల్కొండ కోటలో ఆగస్టు 15 వేడుకలు :  సీఎస్​శాంతి కుమారి

హైదరాబాద్​, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ..  ఆగస్టు 15 న గోల్కొండలో ఉదయం 10.30కు సీఎం కేసీఆర్​జాతీయ పతాకావిష్కరణ చేస్తారన్నారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్ర్య సమరయోధులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపారు.  అధికారులు తగిన ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్​ శాంతికుమారి ఆదేశించారు.