- శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుకున్న అధికారులు
శంషాబాద్, వెలుగు: ఫ్లైట్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు సూడాన్ దేశస్తులను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం దుబాయ్ నుంచి ఏఐ 952 ఫ్లైట్ శంషాబాద్కు వచ్చింది. అందులోని ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని 7.3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.