
- మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చి దారుణం
- గాయాలతో ఆసుపత్రిలో బాధితురాలు
- మహారాష్ట్రలో ఘోరం
రత్నగిరి: కోల్కతాలో డాక్టర్ రేప్, మర్డర్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగానే.. మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్అత్యాచారానికి గురైంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. మహారాష్ట్ర రత్నగిరిలో నర్సింగ్ స్టూడెంట్(20) కాలేజీ అయిపోగానే ఇంటికి బయల్దేరింది. ఆటోలో వెళ్తుండగా మాట కలిపిన డ్రైవర్ ఆమెకు తాగేందుకు నీళ్లు ఇచ్చాడు. అప్పటికే అందులో మత్తుమందు కలపడంతో అది తాగిన ఆమె స్పృహ కోల్పోయింది.
ఆ తర్వాత ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కొంత సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. వారు వచ్చి గాయాలతో ఉన్న ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. ఈ ఘటన రత్నగిరి సిటీని దిగ్భ్రాంతికి గురిచేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, ఆస్పత్రి సిబ్బంది, నర్సింగ్ వర్గాలు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను అడ్డుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతించాలని అధికారులు హామీ ఇవ్వడంతో వారు నిరసనలు విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.