నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సినీ పక్కిలో నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ ను వెంటాడి నరికి చంపాడు మరో వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్కాపూరి కాలనీలో కోహినూర్ ఎంక్లేవ్ దగ్గర నివసిస్తున్న అబ్దుల్ రహమాన్ (26)  భార్య 6 నెలల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందింది. ఆమె మృతికి కారణం అబ్దుల్ రహమానే అంటూ అతనిపై కక్ష పెంచుకున్నారు రహమాన్ అత్త, మామలు, అత్త సోదరుడు చాంద్(25) . రహమాన్ వల్లే తన మేనకోడలు చనిపోయిందని ఆమె మేనమామ చాంద్ రహమాన్ ని వేధించసాగాడు.

అవి భరించలేని రహమాన్..  చాంద్ ను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. మంగళవారం రోజున  పని ముగించుకొని  ఆటో నడుపుతూ ఇంటికి వెళ్తున్న చాంద్ ను రెహమాన్ నడిరోడ్ లో  పట్టుకుని కత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశాడు. చాంద్ మరణించాడని నిర్దారించుకున్న  తరువాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.