మహిళను వేధించిన ఆటోడ్రైవర్ కు జైలుశిక్ష

మహిళను వేధించిన ఆటోడ్రైవర్ కు జైలుశిక్ష

పద్మారావునగర్; వెలుగు:  మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి  వేధించిన ఆటోడ్రైవర్​కు వారం రోజులు జైలు శిక్ష పడింది. చిలకలగూడ ఎస్ఐ పి.కిషోర్​ తెలిపిన ప్రకారం.. పద్మారావునగర్​కు చెందిన మహిళ గత నెల 27న రాత్రి 11.30 గంటలకు ఆఫీస్​నుంచి క్యాబ్​లో వచ్చి దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది.  ఓ ఆటోడ్రైవర్  వచ్చి ఆమె పక్క నుంచి పోనిచ్చి  ప్రైవేట్​పార్ట్స్​తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

దీంతో అప్రమత్తమైన మహిళ ఆటోడ్రైవర్ ను వారించగా పారిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి.. తుకారంగేట్ కు చెందిన ఆటోడ్రైవర్​షేక్​ నదీమ్ అలీ​(22)గా గుర్తించారు. కేసు నమోదు చేసి సోమవారం సికింద్రాబాద్​15వ స్పెషల్ మెట్రోపాలిటన్​మేజిస్ర్టేట్ జడ్జి ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. అతడికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ఎస్ఐ కిషోర్ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో100 నంబర్ కు డయల్​చేయాలని ప్రజలకు సూచించారు.