పద్మారావునగర్; వెలుగు: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన ఆటోడ్రైవర్కు వారం రోజులు జైలు శిక్ష పడింది. చిలకలగూడ ఎస్ఐ పి.కిషోర్ తెలిపిన ప్రకారం.. పద్మారావునగర్కు చెందిన మహిళ గత నెల 27న రాత్రి 11.30 గంటలకు ఆఫీస్నుంచి క్యాబ్లో వచ్చి దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఓ ఆటోడ్రైవర్ వచ్చి ఆమె పక్క నుంచి పోనిచ్చి ప్రైవేట్పార్ట్స్తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో అప్రమత్తమైన మహిళ ఆటోడ్రైవర్ ను వారించగా పారిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి.. తుకారంగేట్ కు చెందిన ఆటోడ్రైవర్షేక్ నదీమ్ అలీ(22)గా గుర్తించారు. కేసు నమోదు చేసి సోమవారం సికింద్రాబాద్15వ స్పెషల్ మెట్రోపాలిటన్మేజిస్ర్టేట్ జడ్జి ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. అతడికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ఎస్ఐ కిషోర్ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో100 నంబర్ కు డయల్చేయాలని ప్రజలకు సూచించారు.