
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద బుధవారం రాత్రి మహంకాళి ట్రాఫిక్ పోలీసులపై ఇద్దరు ఆటో కార్మికులు దాడికి పాల్పడ్డారు. ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్ సమీపంలో కొద్ది రోజులుగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా రోడ్డుపై ఉన్న ఆటోను అక్కడి నుంచి తీయాలని ఇన్స్పెక్టర్ రఘునందన్ చెప్పగా.. ఇద్దరు డ్రైవర్లు ఆగ్రహంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. వీరిని ట్రాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మార్కెట్ పీఎస్ లో కేసు నమోదైంది.