
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోలకు పర్మిట్లు (అనుమతులు) ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాటిని ఆన్లైన్లోనే ఇవ్వాలని ఆర్టీఏ నిర్ణయించింది. గ్రేటర్లోనే ఆటోలు కొనుగోలు చేయాలన్న గత నిబంధనను సడలించి, తెలంగాణలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కరికి ఒకే ఆటో పర్మిట్ అనే కఠిన నిబంధనతో బినామీ దరఖాస్తులు, డీలర్లు, ఫైనాన్షియర్ల ద్వారా జరిగే బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతకు చెక్పెట్టవచ్చని భావిస్తున్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు నగరంలోనే నివాసం ఉంటున్నట్టు ఇంటి అడ్రస్, ఆధార్కార్డు, త్రీవీలర్లైసెన్స్తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ఆర్టీఏ వెబ్సైట్ ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు పారదర్శకంగా పర్మిట్లు ఇస్తూ ప్రొసీడింగ్స్ఇస్తారు. డీలర్ల వద్దకు వెళ్లి ప్రొసీడింగ్స్చూపిస్తే కొత్త ఆటోలను డెలివరీ చేస్తారు.
గ్రేటర్పరిధిలో ప్రస్తుతం 1.40 లక్షల ఆటోలు ఉండగా, తాజాగా ప్రభుత్వం 65 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 సీఎన్జీ, 10వేల ఎల్పీజీ ఆటోలు ఉన్నాయి. రెట్రోఫిట్టెడ్ఆటోలుగా మార్చుకునేందుకు మరో 25వేల ఆటోలకు పర్మిట్లు ఇవ్వనున్నారు.