కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పరిధిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) 2026–-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జులై 15 నుంచి జులై 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ట్రైనీ (ఇంజినీర్).
మొత్తం ఖాళీలు: 358. తెలంగాణ రాష్ట్రంలో 19 ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి .
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 15.
లాస్ట్ డేట్: జులై 31.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు hindustanpetroleum.comను సందర్శించండి.
