ఢిల్లీలో ఆటో,ట్యాక్సీ,మినీ బస్సు డ్రైవర్ల సమ్మె

ఢిల్లీలో ఆటో,ట్యాక్సీ,మినీ బస్సు డ్రైవర్ల సమ్మె

ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, మినీ బస్సు డ్రైవర్ల సంఘాలు సమ్మె చేపట్టాయి.పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఛార్జీలు పెంచాలని, సీఎన్ జీ ధరలు తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.చాలా యూనియన్లు ఒక్క రోజు దీక్ష చేపట్టగా...సర్వోదయ డ్రైవర్ అసోసియేషన్ సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది.యూనియన్ల డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వంప్రకటించింది. అయినా సమ్మెను విరమించేందుకు కార్మిక సంఘాలు నిరాకరించాయి.క్యాబ్స్, ఆటోలు అందుబాటులోకి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం

లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు

జాతర ముగిసినా కొనసాగుతున్న భక్తుల తాకిడి