టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేయండి: ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి డిమాండ్

టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేయండి: ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి డిమాండ్

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: టీచర్ల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ ఉద్యమ జాగరణ ధర్నా నిర్వహించారు. పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్​లో వినతిపత్రం అందించారు.

 అనంతరం ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతుందన్నారు. జీవో 317తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. తపస్  రాష్ట్ర నేతలు బొడ్డు రవి, జిల్లా అధ్యక్షుడు కాశీరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, టీచర్లు  పాల్గొన్నారు.