
హైదరాబాద్, వెలుగు: అవధి రెస్టారెంట్ ‘అవధ్ దస్తర్ఖాన్’ ను హైదరాబాద్లో ఓపెన్ చేసింది. అవధ్ ప్రాంత రాచరిక వంటలను ఇక్కడ వడ్డిస్తారు. వీటిలో సుగంధ బిర్యానీలు, రుచికరమైన కబాబ్లు, ప్రత్యేకమైన స్వీట్ల వంటివి ఎన్నో ఉంటాయి.
టోలిచౌకి వద్ద ఉన్న వంద సీట్ల అవధి దస్తర్ఖాన్ను 2,700 చదరపు అడుగుల్లో నిర్మించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ గ్రూపు పార్ట్నర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను స్వయంగా లక్నో వెళ్లి వంటలను స్టడీ చేశాకే దీనిని తెరిచానని చెప్పారు. సిటీలో మరిన్ని రెస్టారెంట్లను అందుబాటులోకి తెస్తామన్నారు.