అవధ్​ రుచుల రెస్టారెంట్​ షురూ

 అవధ్​ రుచుల రెస్టారెంట్​ షురూ

హైదరాబాద్, వెలుగు:  అవధి రెస్టారెంట్ ‘అవధ్​ దస్తర్‌‌‌‌‌‌‌‌ఖాన్’ ను హైదరాబాద్​లో ఓపెన్‌‌‌‌ చేసింది.   అవధ్​ ప్రాంత రాచరిక వంటలను ఇక్కడ వడ్డిస్తారు.  వీటిలో సుగంధ బిర్యానీలు,  రుచికరమైన కబాబ్‌‌‌‌‌‌‌‌లు, ప్రత్యేకమైన స్వీట్ల వంటివి ఎన్నో ఉంటాయి. 

టోలిచౌకి వద్ద ఉన్న వంద సీట్ల అవధి దస్తర్‌‌‌‌‌‌‌‌ఖాన్​ను 2,700 చదరపు అడుగుల్లో నిర్మించారు.   ఈ సందర్భంగా రెస్టారెంట్​ గ్రూపు పార్ట్​నర్​ విజయ్​ కుమార్​ రెడ్డి మాట్లాడుతూ తాను స్వయంగా  లక్నో వెళ్లి వంటలను స్టడీ చేశాకే దీనిని తెరిచానని చెప్పారు. సిటీలో మరిన్ని రెస్టారెంట్లను అందుబాటులోకి తెస్తామన్నారు.