ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలో శ్రీనివాసరావుకు పురస్కారం

ప్రపంచ తెలుగు ఐటీ  మహాసభలో శ్రీనివాసరావుకు పురస్కారం

హనుమకొండ, వెలుగు : ప్రపంచ  తెలుగు సమాచార సాంకేతిక మండలి ఆధ్వర్యంలో టీఐటీఏ అధ్యక్షుడు సందీప్‌‌ మక్తాల అధ్యక్షతన సింగపూర్ లో  నిర్వహించిన ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలో సామాజిక రంగ విభాగంలో  తెలంగాణ  నుంచి  ఈవీ  శ్రీనివాస రావుకు  సామాజిక సేవ అవార్డు లభించింది.   

ఈ సందర్బంగా ఐటీ, ఇతర రంగాల్లో పలువురు ప్రముఖులకు అవార్డు  ప్రదానం చేశారు. దాదాపు 80కి పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు.  

సమావేశాల్లో తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌‌రంజన్‌‌, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌  వి. ప్రకాశ్‌‌, ‌‌ తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్   చైర్మన్ పి. జగన్మోహన్‌‌రావు తదితరులు పాల్గొన్నారు.