రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి : కోయ శ్రీహర్ష

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు అవేర్నెస్​ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష సూచించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రోడ్డు భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్ ను, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్​ ప్రజావాణి హాల్ లో రిలీజ్​ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాలపై జిల్లాలోని అన్నిప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. అనంతరం రిపబ్లిక్​ డే సన్నాహక సమావేశం నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్  అశోక్ కుమార్, ఎంవీఐలు మెగా గాంధీ, వీరస్వామి పాల్గొన్నారు.