
Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ప్రస్తుతం యుద్ధానికి కాలుదువ్వుతూ అమెరికాను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న లీడర్. దాదాపు 40 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నుంచే ఇరాన్ అగ్రనేతగా పగ్గాలు చేపడుతున్నారు. తనపై జరిగిన దాడితో చేతికి పక్షవాతం, వినికిడి సమస్యలు వచ్చినప్పటికీ ఒంటి చేతితో ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పైగా ఆ దేశ రాజ్యాంగంలో కూడా మార్పులు చేసి తనకు అన్ని పవర్స్ వచ్చేలా చేసుకున్న లీడర్ ఖమేనీ.
అయితే అయతుల్లా రుహోల్లా ఖమేనీ పూర్వీకులు భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారనే సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాలుగు దశాబ్ధాల నుంచి ఇరానియన్ షియా స్థాపనకు ఖమేనీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఖమేనీ కంటే చాలా కాలం ముందు, ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖమేనీ ఇరాన్ విప్లవాత్మక గుర్తింపును రూపొందించారు. ఆశ్చర్యకరంగా వీరిద్దరి పూర్వీకులు భారతదేశంతో సంబంధం కలిగిన వారు కావటం గమనార్హం.
శతాబ్దాల కిందట షియా స్కాలర్షిప్ కేంద్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా, కింతూర్ గ్రామానికి ఖమేనీ పూర్వీకుల మూలాలు ఉన్నాయి. ఖమేనీ తాత, ఆయన పూర్వీకుడు సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 1800 ప్రాంతంలో యూపీలోనే జన్మించారు. అయితే తర్వాత 1830లో ఇరాక్లోని నజాఫ్కు ఇమామ్ అలీ సమాధిని సందర్శించడానికి వలస వెళ్లి చివరికి అక్కడే స్థిరపడ్డారు. ఇరాన్ అధికారిక రికార్డుల్లో 'హిందీ' అనే పదాన్ని తన పేరులో ఖమేనీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
►ALSO READ | ఇరాన్ యుద్ధంలోకి దిగబోతున్నాం: ట్రంప్ ప్రకటనతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా..?
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ స్థాపకుడు అయెతుల్లా రూహొల్లా కమేనీ ఇరాన్ చరిత్రలో చాలా కీలకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ఆ దేశ కరెన్సీపై ఇప్పటికీ ఆయన చిత్రాలను కలిగి ఉండటం నుంచి తెహ్రాన్ ప్రాంతంలో ఆయన సమాధిని బంగారు గోపుతంలో నిర్మించటం వరకు ప్రాధాన్యత కలిగి ఉన్నారు. అయితే ఖమేనీ కుటుంబం మూలాలు ఇండియాలో ఉన్నట్లు చాలా తక్కుమ మందికి మాత్రమే తెలుసు.
ఇరాన్ సుప్రీమ్ లీడర్ అలీ ఖమేనీ 1939లో మషాద్ ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జావద్ ఖమేనీ మత గురువు. పైగా మెుత్తం ఎనిమిది మంది సంతానంలో అలీ ఖమేనీ రెండవ వాడు. ఆయన సోదరులు కూడా కొందరు మత ప్రభోదకులుగా కొనసాగుతున్నారు.