ఖైరతాబాద్, వెలుగు: అంబర్పేట సెగ్మెంట్ కాంగ్రెస్ టికెట్ను లక్ష్మణ్ యాదవ్కు కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు అయిల బోయిన రమేష్ డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ రిలీజ్ చేసిన రెండు లిస్టులలో 100 మంది అభ్యర్థులకు టికెట్లు కేటాయించగా.. అందులో 18 మంది మాత్రమే బీసీలున్నారన్నారు.
ఇద్దరు యాదవులకు మాత్రమే టికెట్లు దక్కాయన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు యాదవులను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొండిచేయి చూపుతోందని ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడకపోవడమేంటని బోయిన రమేశ్ ప్రశ్నించారు. లక్ష్మణ్ యాదవ్కు టికెట్ కేటాయించకపోతే యాదవులంతా కాంగ్రెస్కు బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో విజయ్ యాదవ్, యశ్వంత్, రాజ్ యాదవ్, శశి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.