అయోధ్య రాముడి దర్శన వేళల్లో మార్పులు

అయోధ్య రాముడి దర్శన వేళల్లో మార్పులు
  • ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి

అయోధ్య :  బాలక్ రామ్​ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఇంతకు ముందు ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉన్న సమయాలను మార్చింది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో  ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించింది. దీనిని గురువారం నుంచే అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం 5 లక్షల మంది, బుధవారం 3 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు.