
హైదరాబాద్, వెలుగు: దేశంలోని నేషనల్ హైవేస్ ఫొటోలు తీసి పంపాలని, ఎంపికైన ఫొటోలకు బహుమతులు ఇవ్వనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా డిజిటల్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్ 2022 నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నేషనల్ హైవేస్ ఫొటో తీసి, ఎన్ హెచ్ఏఐ అధికారిక https://www.nhai.gov.in. వెబ్సైట్లో వచ్చే నెల 22 వ తేదీలోగా అప్లోడ్ చేయాలని సూచించింది. ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి ఫొటోగ్రాఫర్లకు బహుమతులు ఇస్తామని వివరించింది. మొదటి ప్రైజ్ కింద రూ.50 వేలు, రెండో ప్రైజ్ 30 వేలు, మూడో ప్రైజ్ కింద 20 వేల నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.