
ఖైరతాబాద్, వెలుగు : ఉమ్మడి ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 1998 నియామకాల్లో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని, అక్రమంగా నాన్లోకల్అభ్యర్థులను టీచర్లుగా నియమించారని డీఎస్సీ1998 క్వాలిఫైడ్యూనియన్అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నామని, సుమారు 2 వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కొందరి వయస్సు అయిపోయిందని, ఇప్పుడున్న వారిలో అర్హులకు కాంగ్రెస్ప్రభుత్వం ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వం అప్పటి వారందరికీ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సంజీవ్, తుమ్మన పల్లి శ్రీనివాస్,ఇషాక్అలి, శర్మ తదితరులు మాట్లాడారు.