
- ఏపీలో తెలంగాణ రిజర్వేషన్లు ఎత్తేశారు: వినోద్ కుమార్
హైదరాబాద్, వెలుగు: ఏపీలో నాలుగు సైనిక్ స్కూళ్లిచ్చి.. తెలంగాణకు ఒక్క సైనిక్ స్కూల్నూ కేంద్రం ఇవ్వకపోవడం దారుణమని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బి. వినోద్ కుమార్మండిపడ్డారు. ఏపీలోని కోరుకొండ, పులివెందుల, కలికిరిలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయని, ఇప్పుడు విజయవాడకు మరొకటి మంజూరు చేశారని చెప్పారు. వరంగల్కు సైనిక్ స్కూల్ను మంజూరు చేసినా కేంద్రం ఎన్నో షరతులు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సైనిక్ స్కూల్కు ఖర్చులన్నీ భరించాలని గతంలో చెప్పారని..దానిపై అప్పటి సీఎం కేసీఆర్నిరసన తెలిపారని గుర్తుచేశారు.
బుధవారం వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ ఇవ్వకపోగా.. ఏపీలోని సైనిక్ స్కూళ్లలో తెలంగాణకు ఉన్న రిజర్వేషన్ కోటాను ఎత్తేశారని మండిపడ్డారు. ఏపీ సైనిక్ స్కూళ్లలో ఏపీ, తెలంగాణలకు కలిపి 67 శాతం రిజర్వేషన్లుండేవని, కానీ, ఇప్పుడు తెలంగాణకు రిజర్వేషన్లు ఎత్తేసి కేవలం ఏపీకే 67 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టాక.. తాను సైనిక్ స్కూల్ గురించి లేఖ రాస్తే హేళన చేస్తూ మాట్లాడారన్నారు.