నేను బీఆర్ఎస్​లో చేరట్లేదు పుకార్లు నమ్మవద్దు: బాబుమోహన్ ​

నేను బీఆర్ఎస్​లో చేరట్లేదు పుకార్లు నమ్మవద్దు: బాబుమోహన్ ​

హైదరాబాద్, వెలుగు: తాను బీఆర్ఎస్​పార్టీలో  చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బాబుమోహన్​అన్నారు. వరంగల్​ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు కేసీఆర్​ఇటీవల కాలంలో ఎప్పుడూ ఫోన్​ చేయలేదని, ఆయనతో మాట్లాడి ఆరేండ్లు అవుతున్నదని చెప్పారు. తనపై వచ్చే పుకార్లు నమ్మవద్దని బాబుమోహన్​ కోరారు.