నడి రోడ్డుపై శిశువు డెడ్​బాడీ భాగాలు

నడి రోడ్డుపై శిశువు డెడ్​బాడీ భాగాలు

జీడిమెట్ల, వెలుగు: రోడ్డుపై శిశువు డెడ్​బాడీ భాగాలు కలకలం రేపాయి. పేట్​బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఘటన జరిగింది. జీడిమెట్ల డివిజన్​ ఎంఎన్​రెడ్డినగర్​ మెయిన్​ రోడ్డుపై గురువారం నవజాత శిశువు మృతదేహం భాగాలు  కన్పించాయి.   దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్​స్వ్కాడ్​, క్లూస్​టీంతో తనిఖీలు చేశారు. డాగ్​స్వ్కాడ్​ కొంతదూరం వెళ్లి వెనక్కి వచ్చాయి. దీంతో  మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుందని స్థానికులు గుర్తుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.