సరికొత్త బైక్ 72 కి.మీల మైలేజ్ తో.. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 లాంచ్

సరికొత్త  బైక్ 72 కి.మీల మైలేజ్ తో.. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 లాంచ్

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో నుంచి సరికొత్త బైక్ విడుదలైంది.హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్ టెక్ 25.0బైకును చేసింది. మునుపటి మోడల్ లో స్వల్ప స్టైలింగ్ మార్పులు, అదనపు ఫీచర్లతో  ఈ బైక్ వచ్చింది. 125సీసీ  సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో లీటర్ పెట్రోల్ కు 72 కి.మీల మైలేజ్ ను అందిస్తుంది.  

ఫీచర్ల విషయానికి వస్తే..XTEC 2.0 బ్లూటూత్ కనెక్టివిటీ ,USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన అదే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఈ బైకులో హజార్డ్ లైట్లు కీలకమైన అదనపు ఫీచర్ జోడించారు.స్టైలింగ్ అప్డేట్ లలో డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, XTEC 2.0 బ్యాడ్జింగ్, 3D సింబర్, కుట్టుతో కూడిన డ్యూయల్-టెక్చర్డ్ సీటు,రిమ్ టేపులు ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ ఐదు రంగులలో లభిస్తుంది. గ్లాసీ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మ్యాట్ నెక్సస్ బ్లూ ,మ్యాట్ చెస్ట్‌నట్ బ్రౌన్ రంగుల ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ధర విషయానికి వస్తే రూ. 86,500 (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తోంది. ఇది ప్రస్తుతం రూ. 88,044 ధర కలిగిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో సూపర్ స్ప్లెండర్ XTEC కంటే కొంచెం ధర తక్కువ.