నేనేమైనా పరవాలేదు.. టాలీవుడ్ బాగుండాలి.. బేబీ దర్శకుడి ఫ్యాన్ వార్

నేనేమైనా పరవాలేదు.. టాలీవుడ్ బాగుండాలి.. బేబీ దర్శకుడి ఫ్యాన్ వార్

సాయి రాజేష్(Sai rajesh).. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు చాలా వినిపిస్తోంది. బేబీ(Baby) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.91 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఈ ఒక్క సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో టాలీవుడ్ ఫోకస్ మొత్తం తనవైపుకు తిప్పుకున్నాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు. అప్పటి నుండి ఈ దర్శకుడి నుండి వచ్చే తరువాతి సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ దర్శకుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు, ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. ఇందులో భాగంగా ఒక నెటిజన్.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు..? అని సాయి రాజేష్ ను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా..  నా చదువు, లైఫ్, కెరీర్ మొత్తం పోయినా సరే.. టాలీవుడ్ బాగుండాలని ఫ్యాన్ వార్స్ చేసేవాడిని.. అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి రాజేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.