మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో శిశువుల మార్పిడి కలకలం రేపుతోంది. పది నిమిషాల వ్యవధిలో చెన్నూరు మండలం రొయ్యలపల్లికి చెందిన మమత, కుమురంభీం జిల్లాకు చెందిన పావని డెలివరీ అయ్యారు. తమకు మగబిడ్డ పుట్టిందని చెప్పిన నర్సులు.. ఆడబిడ్డను ఇచ్చారని మమత కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. తమకు మగబిడ్డ పుట్టాడని పావని కుటుంబసభ్యులు అంటున్నారు. దీంతో ఇరు కుటుంబాలు, నర్సులకు మద్య గొడవ జరిగింది. సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి సర్దిచెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు.
ఇద్దరు శిశువులను.. శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. డీఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా పిల్లలను అప్పగిస్తామని హాస్పిటల్ ఇంచార్జీ హరిచంద్ర రెడ్డి చెప్పారు. దీనికి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించారు.