నేరడిగొండ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందజేయాలని రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న డిమాండ్ చేశారు. గురువారం నేరడిగొండ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కౌలు రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెక్కలు ముక్కలు చేసుకొని తాము పండించిన పంటలను అమ్ముకునేందుకు సాంకేతిక, ప్రభుత్వ నిబంధనల వల్ల అమ్ములకోలేక అవస్థలు పడుతున్నారన్నారు.
