సుల్తాన్ బజార్ పోలీసుల తనిఖీల్లో .. రూ.24 లక్షల 75 వేలు సీజ్

సుల్తాన్ బజార్ పోలీసుల తనిఖీల్లో .. రూ.24 లక్షల 75 వేలు సీజ్

బషీర్​బాగ్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి అబిడ్స్​లోని చిరాగ్ గల్లీలో బైక్​పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  రూ.10 లక్షలను గుర్తించారు. బైక్ పై ఉన్న అంబర్ పేటకు చెందిన స్క్రాప్ వ్యాపారి మన్ ప్రీత్ సింగ్, అతడి సహాయకుడు హర్షద్​ను ప్రశ్నించారు.

డబ్బుకు సంబంధించి ఎలాంటి పేపర్లను చూపించకపోవడంతో ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. అదే విధంగా సుల్తాన్ బజార్ లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.14 లక్షల 75 వేలను సీజ్ చేసినట్లు ఏసీపీ బాల గంగిరెడ్డి తెలిపారు.