
అమెరికాలోని పలు ప్రాంతాలను తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి ఐదుగురు చనిపోయారు. దాదాపు 3 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉత్తర కరోలినాలోని తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. పెన్సిల్వేనియాలోనూ భారీగా తుపాను వచ్చింది. దీంతో పశ్చిమ వర్జీనియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదనీరు నివాసాలను చుట్టుముట్టడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాలేజీ, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా, జార్జియాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. భీకర గాలులకు చాలా చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతోపాటు మంచు భారీగా కురుస్తుండటంతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్నారు.