అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి : బడే నాగజ్యోతి

 అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి : బడే నాగజ్యోతి

కొత్తగూడ,వెలుగు :  కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు గంటలే కరెంట్​ ఉంటుందని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు.మంగళవారం ఆమె మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్ పార్టీని రైతులు నిలదీయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు,అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్​ పాల్గొన్నారు.