కొత్తగూడ (గంగారం), వెలుగు: నీతి ఆయోగ్ స్కీమ్లో ఎంపికైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తించినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్స్టేట్ సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్కు తెలిపారు. సోమవారం నీతి ఆయోగ్ లో ఎంపికైన గంగారం మండల అభివృద్ధిపై సెర్ఫ్ సీఈవో కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంగారం మండలంలోని 12 జీపీల్లో 791 కుటుంబాలను నిరుపేదలుగా గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్, హౌసింగ్ పీడీ పురుషోత్తం, డీఆర్డీవో పీడీ మధుసూదన్రాజు తదితరులున్నారు.
