
నటసింహా నందమూరి బాలకృష్ణ , - సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం భగవంత్ కేసరి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్..సినిమాలో అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. తాజాగా భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
2 నిమిషాల 52 సెకన్ల ట్రైలర్లో..బాలయ్య దమ్ము ఏంటో..సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నువ్వు ఏడున్నా ఇట్ల దమ్ముతో నిలబడాలే... అప్పుడే ఈ దునియా నీకు బాంచన్ అంటది అంటూ.. బాలయ్య చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. తన కూతురిని (శ్రీలీల) ఆర్మీలోకి పంపాలని భగవంత్ కేసరి చేసే ప్రయత్నాలు.. ఆమె తన వల్ల కాదని చేతులెత్తేయడం వంటి సన్నివేశాలు..సినిమాలో తండ్రి కూతురు బంధాన్ని హైలైట్ చేశాయి.
కూతురు (శ్రీలీల)ను ఇబ్బంది పెట్టిన రౌడీలతో భగవంత్ కేసరి(బాలయ్య) యుద్దానికి సిద్ధం అవుతాడు. అప్పటి నుంచి భగవంత్ కేసరి దమ్మేంటో తెలుస్తుంది. బాలయ్య డైలాగ్స్, విజువల్స్, వీటిని హైలెట్ చేసే థమన్ బ్యా్గ్రౌండ్ మ్యూజిక్..కేక అని చెప్పాలి. చివర్లో సింహ సినిమాలోని నీ కంటి చూపుల్లో నా ప్రాణం చేరిందే ఏ మాయ చేశావే పాటపై వస్తున్న ట్రోల్స్కు బాలయ్యే స్వయంగా పంచ్ వేయడం కిర్రాక్.
భగవంత్ కేసరి..ఇది బాలయ్యకు మరో యాంగిల్ అని చెప్పాలి. భగవంత్ కేసరి మూవీలో బాలయ్యది పవర్ ఫుల్ మాస్ కారెక్టర్. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ రెట్టింపు అయ్యాయి.
భగవంత్ కేసరి మూవీలో హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది. శ్రీలీల భగవంత్ కేసరి కూతురు పాత్ర చేస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ మూవీని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది.