ఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు అందజేత

ఏపీ సీఎం జగన్ కు బాలాపూర్ లడ్డు అందజేత

అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైదరాబాద్ బాలాపూర్ లడ్డూను మంగళవారం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అందజేశారు ఎమ్మెల్సీ ఆర్‌ రమేష్‌ యాదవ్‌, విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్‌ రెడ్డి. హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్‌లో నిర్వహించిన వేలం పాటలో గణేష్ లడ్డూ రూ.18.90 లక్షలు పలికిన విషయం తెలిసిందే. ఇంత ధర పెట్టి పాడిన ఈ లడ్డూను ఏం చేస్తారన్న ప్రశ్నకు సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు రికార్డు స్థాయి ధరకు పాడి సొంతం చేసుకున్న లడ్డూను ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు అమరావతికి తీసుకొచ్చి సీఎం జగన్ కు అందించారు.