నాలా పనులు స్పీడ్ గా కంప్లీట్ చేయండి : రోనాల్డ్ రాస్

నాలా పనులు స్పీడ్ గా కంప్లీట్ చేయండి : రోనాల్డ్ రాస్
  • ఓల్డ్ సిటీలోని పలు చోట్ల పర్యటన

హైదరాబాద్, వెలుగు: నాలా పనులను స్పీడ్ గా కంప్లీట్ చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, యాకుత్ పురా, చార్మినార్ ఎమ్మెల్యేలతో కలిసి గంగానగర్ వరదనీటి కాలువ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా త్వరగా నాలా పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 

అంతకు ముందు మొఘల్ పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పరిశీలించి, ఇందులోకి బల్దియాకు చెందిన పలు విభాగాల ఆఫీసులను మార్చేందుకు అనువైన భవనాలను గుర్తించాలని పేర్కొన్నారు. అనంతరం చార్మినార్ వద్ద సర్దార్ మహల్ పునరుద్ధరణ, మల్టీ లెవల్ పార్కింగ్ పనులను పరిశీలించారు.

త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మొఘల్ పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో స్విమ్మింగ్ ఫుల్ మరమ్మతులు చేపట్టాలని అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ ను ఆదేశించారు.  కమిషనర్ తో పాటు సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, శానిటేషన్, స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, యాదగిరిరావు, జోనల్ కమిషనర్ వెంకన్న తదితరులు ఉన్నారు.