
హైదరాబాద్, వెలుగు: మాన్పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లపై జీహెచ్ఎంసీ కమిషనర్లోకేశ్ కుమార్ఫైర్అయ్యారు. 38 మంది ఇంజనీర్లకు ఒకరోజు జీతం కట్ చేశారు. ఇలాగే వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. బల్దియా హెడ్డాఫీసులో మంగళవారం ఆయన ఇంజనీర్లతో సమావేశమయ్యారు.
ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు చేసిన తనిఖీల్లో లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త బోర్డులు పెట్టని, నాలా పూడికతీత పనులను పూర్తిచేయని 14 డివిజన్లను గుర్తించామన్నారు. వాటి పరిధిలోని 38 ఇంజనీర్ల జీతాల్లో కోత విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జోన్లో 9 మంది, శేరింలింగంపల్లిలో 8, చార్మినార్ లో 9, కూకట్పల్లిలో 6, ఖైరతాబాద్లో నలుగురు, ఎల్బీనగర్ జోన్ లో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. సమావేశం అయిపోయాక ఒక్కో పనికి ఐదారు సార్లు టెండర్లు వేసినా ఎవరూ రాకపోతే మనం ఏం చేస్తామని పలువురు ఇంజనీర్లు చర్చించుకున్నట్లు సమాచారం.