శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ ఏకగ్రీవం

 శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ ఏకగ్రీవం

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాష్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్... స్వయంగా ఆయనను తీసుకెళ్లి చైర్మన్ చైర్ లో కూర్చోబెట్టారు. బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చిన బండ ప్రకాష్.. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. రాజ్యసభ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని తాను కోరానన్నారు.  శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్ రావు పదవి కాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. బండ ప్రకాష్ 2021లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికైన విషయం తెలిసిందే.