CAAకు వ్యతిరేకంగా బీహార్ లో బంద్

CAAకు వ్యతిరేకంగా బీహార్ లో బంద్

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బిహార్ లో ఆర్జేడీ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఆర్జేడీ నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దర్భంగా, వైశాలి ప్రాంతాల్లో హైవేలపై ఆందోళన చేపట్టారు. సీఎం నితీష్ కుమార్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల  బర్రెలను రోడ్లపైకి తెచ్చి ట్రాఫిక్ ఆగేలా చేశారు ఆర్జేడీ కార్యకర్తలు.