టీఆర్ఎస్ పాలనలో ఎటు చూసినా సమస్యలే

టీఆర్ఎస్ పాలనలో ఎటు చూసినా సమస్యలే

జోగులాంబ గద్వాల : 2023లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరవేయటం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే ఈర్డీఎస్ సమస్యకు పరిష్కారం దొరికిందని అన్నారు. ఆర్డీఎస్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని 87,500 ఎకరాలకు నీళ్లిస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. కేఆర్ఎంబీ మార్చి 9న పర్యటించి నివేదిక ఇవ్వడంతో కేంద్రం ఆరు నెలల్లో నీళ్లందిస్తామని జీవో విడుదల చేసిందని చెప్పారు. 

కేంద్రం నిధులిస్తున్నా కేసీఆర్ మాత్రం ఇవ్వడం లేదని ప్రధాని మోడీని విమర్శిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర నిధులను ముఖ్యమంత్రి దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తున్నందుకే తెలంగాణలో అరాచకాలు మొదలుపెట్టారని, కానీ బీజేపీ కార్యకర్తల జోలికొస్తే సహించమని హెచ్చరించారు. టీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీకి మద్దతు తెలపాలని ప్రజల కోరారు.