కేసీఆర్​ టైం పాస్​ రాజకీయాలు చేస్తున్నరు

కేసీఆర్​ టైం పాస్​ రాజకీయాలు చేస్తున్నరు

సీఎం కేసీఆర్​పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ టైం పాస్​ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీ పెట్టే ముందు తెలంగాణకు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్​ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్​ విసిరారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేశారని మండిపడ్డారు.ఇప్పుడు దేశ ప్రజలను కూడా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో కుటుంబ పాలన, అవినీతి పార్టీలు అంతం అవుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ అవినీతి రహిత పాలన చేస్తుంటో..తెలంగాణలో మాత్రం అవినీతి, కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు.