బీసీలను కేటీఆర్ అవమానించారు..తక్షణమే క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

బీసీలను కేటీఆర్ అవమానించారు..తక్షణమే క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

కరీంనగర్: బీసీలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. బీసీలను మంత్రి కేటీఆర్ అవమానిస్తున్నారు.. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పిన తర్వాలే బీఆర్ ఎస్ ఓట్లు అడగాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా.. బీఆర్ ఎస్ లో ఎంతమంది గుణవంతులకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని బండి సంజయ్ అన్నారు. డిపాజిట్లే రాని కాంగ్రెస్.. బీఆర్ ఎస్ కు ఎట్టా ప్రత్యామ్నాయం అవుతుందో చెప్పాలన్నారు. బీఆర్ ఎస్ కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై బీజేపీ గ్రాఫ్ ను తగ్గించే కుట్ర చేస్తున్నాయన్నారు బండి సంజయ్. 

కరీంనగర్ లో పోటీ చేస్తామని చేసిన ప్రగల్భాలు ఏమయ్యాయి.. పేదల పార్టీ బీజేపీకి, దోపిడీ పార్టీలు బీఆర్ ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య జరుగుతున్న పోరాటమిది.. రాబోయే ఎన్నికల్లో బీజీపీ విజయం.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ జోస్యం చెప్పారు. 

ALSO READ :- ODI World Cup 2023: ప్రమాదంలో ఇంగ్లాండ్ జట్టు.. మరో రెండు ఓడితే ఐసీసీ టోర్నీకి దూరం