21, 22 తేదీల్లో బీజేపీ కేడర్​తో సంజయ్​ భేటీ

21, 22 తేదీల్లో బీజేపీ కేడర్​తో సంజయ్​ భేటీ

బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్​లోని పార్టీ స్టేట్​ ఆఫీసులో బీజేపీ నాయకులను, కార్యకర్తలను  కలువనున్నారు. రాష్ట్ర చీఫ్​గా నియమితులైన తర్వాత 15న హైదరాబాద్ వచ్చిన ఆయన.. స్వాగత సభలో పాల్గొని తిరిగి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. దీంతో చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కలువలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో అందుబాటులో ఉండనున్నారు.  21 న సీనియర్ నేతలను కలుసు కొని ఆశీర్వాదం తీసుకోనున్నారు. 22 న  కార్యకర్తలను, నాయకులను కలువనున్నారు.