సంజయ్ పాదయాత్ర వాయిదా

సంజయ్ పాదయాత్ర వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 9 నుంచి చేపట్టనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర 24కు వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సోమవారం మీడియాకు చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి యాత్ర ఉన్నందున పాదయాత్ర వాయిదా పడిందని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌‌‌‌రెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో ఈ నెల 16 నుంచి 18 వరకు తెలంగాణలో పర్యటించను న్నారని, ఈ కార్యక్రమంలో సంజయ్‌‌ పాల్గొంటారని చెప్పారు. కోదాడ నుంచి ఈ యాత్ర నిర్వహించనున్నారని, దీనికి రాష్ట్ర పార్టీ తరఫున ఘన స్వాగతం పలుకుతామన్నారు.