అందరికీ సమన్యాయం జరగాలన్న అంబేద్కర్ ఆశయాలను బీజేపీ నెర వేరుస్తుందన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంబేద్కర్ ఆలోచనల ప్రకారం మోడీ సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి బయటకి వచ్చి అంబెడ్కర్ కి నివాళులు అర్పించాలని లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ కొనసాగిస్తోందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి.
ముఖ్యమంత్రి అంబేద్కర్ కు నివాళులర్పించాలి: వివేక్
ముఖ్యమంత్రి బయటకు వచ్చి అంబేద్కర్ కు నివాళులర్పించాలన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ దళితులను మోసం చేశారని విమర్శించారు. కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే దళితులను అన్యాయ చేశాడు కేసిఆర్. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మర్చిపోయిందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం బీజేపీ పని చేస్తుందన్నారు.